22 June, 2026 | 3:20 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

బాన్సువాడలో స్కూటీలో నుంచి భారీ నగదు చోరీ..

08-10-2025 04:42 PM

బాన్సువాడ (విజయక్రాంతి): స్కూటీలో నుంచి సినీ పక్కిలో భారీ నగదు చోరీ జరిగిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ బ్యాంకులో బంగారం కుదువపెట్టి తెచ్చిన రూ.లక్షన్నర నగదును స్కూటీ డిక్కీలో డబ్బులు డిక్కీలో పెట్టి వసతి గృహంలో పనిచేసేందుకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి స్కూటీ డిక్కీలో డబ్బులు కనిపించలేదు. అప్పటికే లక్షన్నర నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆందోళన చెందిన బాధితురాలు రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.