calender_icon.png 13 June, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చార్టెడ్ అకౌంటెంట్లకు కేంద్రంగా హైదరాబాద్

13-06-2025 01:24:53 AM

సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టం ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతోనూ పోటీ పడు తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇండియా (ఐసీఏఐ), హైదరాబాద్ శాఖల ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఏర్పాటుచేసిన సీఏ విద్యార్థుల జాతీయస్థాయి సదస్సులో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

చార్టె డ్ అకౌంటెంట్లకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంద న్నారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవం, రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు అనేక పరిశ్రమలకు కేంద్రం గా తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. ఐటీ, ఫార్మా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, టెక్స్‌టైల్ పార్క్ వంటి వాటితో అభివృద్ధిలో ప్రపంచ పటం లో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుందని వివరించారు.

సీఏ కోర్సు పూర్తి చేసుకొని వస్తున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ర్టంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. భారతదేశ ఆర్థిక, ధన, వినియోగ నైతికతకు మూలస్తంభంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇండియా నిలుస్తోందన్నారు. చార్టెడ్ అకౌంటెంట్లు నైతికతకు కట్టుబడి ఉండాలని, టెక్నాలజీ ఆటోమేషన్ శరవేగంగా పెరుగుతున్న ఈ యుగంలో మీ నిజాయతేయే మీకు అత్యంత విలువైన ఆస్తి అని పేర్కొన్నారు.