13-06-2025 01:26:25 AM
ఇద్దరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
రాజేంద్రనగర్, జూన్ 12 : వెల్డింగ్ పనులు చేస్తుండగా గ్యాస్ లీక్ అయి బ్లాస్టింగ్ కావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్లో సిబ్బంది మాధవ్, గోపి గ్యాస్ ట్యాంకర్ మూత వద్ద గ్యాస్ పైపునకు వెల్డింగ్ చేస్తుండగా పక్కనే గ్యాస్ లీక్ కావడంతో బ్లాస్టింగ్ జరిగింది.
ఈ ప్రమాదంలో సిబ్బంది మాధవ్, గోపికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బ్లాస్టింగ్ జరిగిన వెంటనే స్థానిక పోలీసులు చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.