12 June, 2026 | 5:35 PM

Breaking News

విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి   •   విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •  

సౌదీ బస్సు ప్రమాదం.. వివిధ ఆస్పత్రులకు మృతదేహాలు

17-11-2025 01:58 PM

హైదరాబాద్: సౌదీ బస్సు ప్రమాదంపై హైదరాబాద్ జాయింట్ సీపీ ఇక్బాల్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.  సౌదీలో మరణించిన వారి మృతదేహాలను వివిధ ఆసుపత్రులకు తరలించారని, భారత దౌత్య అధికారులు ఆసుపత్రులకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. భారత దౌత్య అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం తీసుకుంటున్నామన్నారు.

తామ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 54 మంది హైదరాబాద్ నుంచి సౌదీకి వెళ్లారని, ప్రమాదంలో బస్సులో 46 ప్రయాణించగా, అందులో ఒక ప్రయాణికుడు మాత్రమే బతికి బయటపడ్డాడు. మిగతా వారందరూ మరణించారని హైదరాబాద్ జాయింట్ సీపీ తెలిపారు. బాధిత కుటుంబాల కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని జాయింట్ సీపీ ఇక్బాల్ వివరించారు.