calender_icon.png 13 June, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌ను సినీ రాజధానిగా తీర్చిదిద్దాలి

11-06-2025 12:00:00 AM

  1. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయండి
  2. 14న గద్దర్ సినిమా అవార్డుల ప్రదానం వైభవంగా నిర్వహించాలి 
  3. సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని సినిమా సిటీకి రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సిద్ధం చేయాలని సమాచార శాఖ కమిషనర్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను డిప్యూటీ సీఎం, మంత్రుల సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ఆదేశించారు. మంగళవారం సబ్ కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చ ర్చించారు.

హైదరాబాద్‌ను సినిమా సిటీగా అభివృద్ధి చేసి, దేశవిదేశాల నుంచి సినిమా రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రస్తు తం రాష్ర్టంలో సినిమా షూటింగ్ చేయాలంటే పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ వంటి శాఖల నుంచి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి ఉందని, దీనివల్ల సినీ పరిశ్రమ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తుచేశారు.

ఈ సమస్యను పరిష్కరించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. వివిధ శాఖల నుంచి ఇవ్వాల్సిన అనుమతులను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో ఒక అధికారిని నియ మించి ఆయన ద్వారా అన్ని శాఖల అనుమతులు త్వరితగతిన ఇప్పించేలా సింగిల్ విండో పద్ధతిని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో షూటింగులు జరగడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధికి అవ కాశం ఉందన్నారు.

సినిమా థియేటర్లలో క్యాంటీన్లలో తినుబండారాలు ఇతర వస్తువులు అత్యధిక రేట్లకు విక్రయిస్తున్నారని, సా మాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఎఫ్‌డీసీకి గతంలో రాష్ర్ట ప్రభు త్వం 50 ఎకరాలు మంజూరు చేసిందని, ప్ర స్తుతం ఆ భూమి పరిస్థితి, వివరాలను వచ్చే సమావేశం నాటికి తీసుకురావాలని సబ్ కమి టీ అధికారులకు సూచించింది. చిత్రపురి కాలనీపై ఏర్పాటుచేసిన ఆర్సీఎస్ కమిటీని వచ్చే సమావేశానికి పిలిపించాలని చెప్పారు. ఈనెల 14న నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అ వార్డ్స్ ఫంక్షన్‌ను నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్య క్రమానికి తెలుగు సినీ రంగ ప్రముఖులందరినీ ఆహ్వానించాలని, తెలుగు సినిమాతోపా టు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ నటులను గుర్తించి ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ స్పెషల్ సీఎస్ రవిగుప్తా, సమాచార శాఖ కమిషనర్ హరీశ్, ఎఫ్‌డీసీ డైరెక్టర్ కిశోర్‌బాబు పాల్గొన్నారు.