calender_icon.png 12 June, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

10-06-2025 11:28:54 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని దిల్వార్పూర్ మండల(Dilawarpur Mandal) కేంద్రంలో మంగళవారం రాత్రి పది గంటల 30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నిర్మల్(Nirmal)కు చెందిన సయ్యద్ అక్బర్(28), పాలిష్ ఖాన్(19) ఇద్దరు యువకులు మోటార్ సైకిల్ పై వస్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక దాబా హోటల్లో చికెన్ ఇవ్వడానికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. అయితే మృతదేహాలు ఒకదానికి ఒకటి దూరంలో ఉండడం బైకు వేరే చోట ఉండడంతో ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలం చేరిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి పూర్తి వివరాలు రాబట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.