17 May, 2026 | 8:56 PM

నేటి నుంచి బెంగళూరులో హైడ్రా పర్యటన

07-11-2024 12:45 AM

చెరువుల పరిరక్షణపై అధ్యయనం 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 6 (విజయక్రాంతి): హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణ, సుందరీకరణ కోసం బెంగళూరులో కొనసాగు తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు హైడ్రా అధికారులు నేటి నుంచి మూడ్రోజుల పాటు బెంగళూరులో  పర్యటించనున్నారు.

బెంగళూ రులో అతి తక్కువ ఖర్చుతో 35 చెరువులను పరిరక్షించి, సుందరీకరణ చేసిన అంశాన్ని మల్లి గవాడ్ హైడ్రా అధికారులకు వివరించారు. అదే సమయంలో బెంగళూ రును సందర్శించి చెరువుల పరిరక్షణ తీరును పరిశీలించాలని కోరారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తన బృందంతో కలిసి చెరువులను పరిశీలన చేయనున్నారు.