31-10-2025 08:02:44 PM
 
							ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం మున్సిపల్ చౌదరిగూడ డాక్టర్స్ కాలనీలో 4వేల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేయు 4వేల గజాల పార్కు స్థలo విషయమై కాలనీ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రికార్డులు పరిశీలించిన హైడ్రా అధికారులు శుక్రవారం పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూరా ఫినిషింగ్ వేయించారు. గతంలో ఎవ్వరూ చేయని పనిని హైడ్రా చేసినందుకు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.