యంనంపేట్ వాగు కబ్జాను పరిశీలించిన హైడ్రా అధికారులు
ఘట్ కేసర్, జూన్ 3 (విజయక్రాంతి): ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్ బొంతకుంట వాగుపై ని ర్మించిన చెక్ డ్యామ్ ఎగువ భాగంలో ఓబ డా రియల్ ఎస్టేట్ సంస్థ మట్టితో వాగును కబ్జా చేయడం పై బుధవారం హైడ్రా ఏసిపి ఉమామహేశ్వరరావు ఇంతర శాఖల అధికారులతో కలసి వాగును పరిశీలించారు. యంనంపేట్ సర్వేనంబర్ 153,154లో ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ బహుల అంతస్తు భవనాలు నిర్మిస్తున్నారు.
దాని సమీపంలోని ఉన్న బొంతకుంట వాగును రియల్ ఎస్టేట్ సంస్థ మంటితో పూడ్చివేయడంతో స్థానికులు హైడ్రా అధికారులకు పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా ఏసిపి ఉమా మహేశ్వరరావు, సిఐ రాజశేఖర్, ఇరిగేషన్ ఏఈ, సర్వేయార్, రెవెన్యూ సిబ్బందితో వాగును పరిశీలించారు. ఎగువ భాగంలో సర్వే పాయింట్లు నిర్వహించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. మరొక్కసారి శుక్రవారం సర్వే నిర్వహిస్తామని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.






