15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వజ్జపల్లి తాండ అభివృద్దికి కృషి చేస్తాను

23-02-2026 04:21 PM

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

సదాశివనగర్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తండా గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే గ్రామ పంచాయతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యను గ్రామ పంచాయతీ సర్పంచ్ సంధ్య పాలక వర్గం సభ్యులు సన్మానించారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామపంచాయతీ తండాలకు నూతనంగా పంచాయతీ భవనాలు ఏర్పాటు చేస్తానన్నారు. వజ్జేపల్లి తండాలో నీటి సమస్య, పంచాయతీ భవన నిర్మాణం, రోడ్డు పనులను పరిస్కరం కోసం కృషి చేస్తానన్నారు. సర్పంచ్ సంధ్య-విజయ్ కుమార్ పాలక వర్గం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో సమస్యను పరిష్కారం చేస్తానని  హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాండ నాయకులు పాల్గొన్నారు.