17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నేటితో ముగియనున్న ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ

24-11-2025 11:08 AM

హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి(iBomma Ravi) పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఐదోరోజు విచారణ అనంతరం పోలీసులు రవిని కోర్టులో హాజరపర్చనున్నారు. సినిమాల పైరసీ ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో పొంతన లేని కొన్న సమాధానాలు చెప్పినట్లు సమాచారం. దేశ, విదేశాల్లో వందలాది ఏజెంట్లను నియమించుకున్నట్లు గుర్తించారు. విచారణలో విదేశీ సర్వర్లు, యూకే, కరేబియన్ లో ఏజెంట్ల గురించి ఏమీ చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో డొమైన్ ఏర్పాటుపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు డిలీట్ చేసిన డేటా రికవరీకి ప్రయత్నిస్తున్నారు. రవి అకౌంట్లు, క్రెడిట్ కార్డుల వివరాలతో పలు బ్యాంకులకు సీసీఎస్ పోలీసులు మెయిల్స్ పంపారు. పైరసీ మొత్తం తాను ఒక్కడినే చేశానని రవి అంటున్నాడు. వెబ్ డిజైనింగ్ నాలెడ్జ్ తో అన్నీ తానే చేశానని తెలిపాడు. సర్వర్, వెబ్ సైట్ ల వివరాలు మాయం చేశాడు. తన అరెస్టు ముందే ఊహించానని ఐబొమ్మ రవి చెప్పాడు. మూడు నెలలుగా ఐబొమ్మ రవి కదలికలపై పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలిసిందే.