calender_icon.png 2 February, 2026 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ మ్యాచ్ బహిష్కరణపై ఐసీసీ ఆందోళన

02-02-2026 12:50:05 PM

2026 టీ20 ప్రపంచ కప్‌కు(World Cup) సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ జట్టు టీ20 టోర్నమెంట్‌లో(T20 Tournament) పాల్గొన్నప్పటికీ, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 15న కొలంబోలో గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ తలపడాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుండి తొలగించిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం(Pakistan Government) ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిస్పందనగా, ఐసీసీ పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇందులో భాగంగా ఆ జట్టును ఈవెంట్‌లో పాల్గొనకుండా నిషేధించే అవకాశం కూడా ఉంది. టీ20 ప్రపంచ కప్(T20 World Cup) వివాదం భారత్-పాకిస్థాన్ ఇద్దరికీ నష్టమేనని విశ్లేషకులు తెలిపారు. 

పాకిస్థాన్ నిర్ణయంపై ఐసీసీ ఆందోళన

భారత్ తో మ్యాచ్ ను పాక్ బహిష్కరించటంపై ఐసీసీ(International Cricket Council) ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం తమ దృష్టికి వచ్చిందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. పీసీబీ నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని ఐసీసీ వెల్లడించింది. టీ 20 వరల్డ్ కప్ లో భారత్(India vs Pakistan)తో మ్యాచ్ ను బహిష్కరించటం సరికాదని ఐసీసీ సూచించింది. పాక్ ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు విరద్ధమని ఐసీసీ హితవు పలికింది. ఎంపిక చేసిన మ్యాచ్ లే ఆడాలనే పాక్ వైఖరి ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. పాక్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్(Cricket fans), ఆదేశ అభిమానులకు మంచిది కాదని తెలిపింది. పాక్ ప్రభుత్వం నిర్ణయం.. ఆ దేశంలో క్రికెట్ పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని ఐసీసీ పేర్కొంది.