పార్లమెంట్ను తవ్వితే.. దొరికింది నాది అవుతుందా?
- వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి కేంద్రం యత్నం
- ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశంలో 500 ఏళ్ల క్రితం మసీదు ఉందా అని అడుగు తున్నారు.. ఒకవేళ పార్లమెంట్ కింద నేను తవ్వితే అక్కడ దొరికేది నాది అవుతుందా అని కేంద్రాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. శనివారం లోక్సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొన్ని మసీ దుల్లో సర్వే చేయాలని, కొన్నింటిని కూల్చివే యాలని కొందరు పిలుపునివ్వడంపై ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు.
వక్ఫ్ సవరణ బిల్లు పేరుతో వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ దేశంలో మైనార్టీలకు అధికారం పంచడానికి ఎవరూ ఇష్టపడడం లేదని 75 ఏళ్ల క్రితం అంబేద్కర్ చెప్పిన మాట ఇప్పటికీ నిజమని ఆయన అన్నారు. ఆర్టికల్ 15,16 కింద రిజర్వేషన్లు కల్పించినా మతం పేరు చెప్పి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించే హక్కును ఆర్టికల్ 26 ఇస్తుందన్నారు. హిందుత్వ జాతీయ వాదాన్ని ప్రజలపై బీజేపీ రుద్దుతోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం సూచించిన విధంగా వితంతవులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమానికి వినియోగించా లన్నారు.






