calender_icon.png 30 December, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లు వాహనం నడిపితే చార్జ్‌షీట్

30-12-2025 01:43:20 AM

  1. లైసెన్స్ లేకపోయినా వర్తింపు 

వాహన యజమాని నిందితుడే 

ఈ చలాన్ నేరుగా కోర్టుకే 

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 29 : మైనర్ల డ్రైవింగ్ నియంత్రణకు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని సిద్దిపేట పోలీసులు నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై మైనర్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేని కేసుల్లో టీఎస్ ఈ యాప్ ద్వారా కేవలం ’జీరో ఫైన్’ టికెట్ మాత్రమే జారీ చేస్తారు. అంటే ఆన్లైన్లో జరిమానా చెల్లించే అవకాశం ఉండదు.

ఈ చలాన్ను నేరుగా కోర్టుకే పంపిస్తామని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వెంటనే, సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ - 201 ప్రకారం సదరు వాహనాన్ని పోలీసులు తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల తరహాలోనే, ఈ కేసుల్లో కూడా నిందితులపై పెట్టీ కేసు చార్జ్ షీ ట్ దాఖలు చేస్తారు.

స్వాధీనం చేసుకున్న వాహనం, ఈ చలాన్ కాపీలతో సహా నిందితులను త ప్పనిసరిగా కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుంది. మైనర్లకు వాహనం ఇచ్చే తల్లిదండ్రులు లేదా యజమానులపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. వాహన యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, వారిని కూడా రెండవ నిందితుడి(ఏ2)గా చేర్చి కోర్టులో ప్రవేశ పెడతారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాపాయం నుంచి కాపాడుకోవాలని, మైనర్లకు వాహ నాలు ఇచ్చి వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.