17 April, 2026 | 8:18 AM

రూ.50వేలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు రాస్తా..!

26-06-2025 12:00 AM
  1. కొత్తిమీర్ పంచాయతీ కార్యదర్శి నిర్వాకం ?
  2. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

కుమ్రంభీం  ఆసిఫాబాద్, జూన్ 25 (విజ యక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు మంజూరులో క్షేత్రస్థాయిలో కొంతమంది డబ్బులకు కక్కు ర్తి పడి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెళ్తుతున్నా యి.  దహేగాం మండలం కొత్తిమీర్ గ్రామపంచాయతీ పరిధిలో శ్యామల, రోజా, పద్మ, లలితకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇల్లు కమిటీ సభ్యులు ఇంటికి వచ్చి స్థలం చదును చేసుకోవాలని సూచించారు.

కొద్ది రోజుల తర్వాత రూ.50 వేల డబ్బులు ఇస్తేనే తమ పేరు రాస్తామని లేకుంటే వేరే వారికి మం జూరు చేస్తామని కార్యదర్శి చెప్పడంతో ఆం దోళన చెందిన బాధితులు బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు తెలి పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇండ్ల లిస్టు లో పేరు రాస్తామని లేకుంటే రాయమని కార్యదర్శి వంశీకృష్ణ మమ్మల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తమ న్యాయం చేయాలని కోరారు.