calender_icon.png 26 June, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా పాలనకు గుర్తుగా చీకటి రోజులు

26-06-2025 12:00:00 AM

  1. ఎమర్జెన్సీ నాటి ఘాతుకాలను ప్రజలకు వివరించాలి

పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపు

ఆదిలాబాద్, జూన్ 25 (విజయక్రాంతి) : భారతదేశ చరిత్రలో అప్పటి ప్రధాని ఇంది రాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ చీకటి పాలనకు గుర్తుగా మిగిలిపోతుందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లు అన్నారు. అప్ప టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ‘విదాన్ హత్య దివాస్‘ను నిర్వహిం చారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణుల సమావేశానికి వారు ముఖ్య అతిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, అప్పటి ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు ఇందిరాగాంధీ కాం గ్రెస్ ప్రభుత్వం చేసిన దురాగతాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేణుగోపాల్, గంగారెడ్డి, చంద్ర, విజయ్, సంతోష్ రెడ్డి, మాధవరావు, జ్యోతిరెడ్డి, ఆకుల ప్రవీణ్, ఆయా మండలాధ్యక్షులు పాల్గొన్నారు.