2 September, 2026 | 11:05 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ముజీబ్ ఆధ్వర్యంలో నాంపల్లిలో ఇఫ్తార్ విందు

14-03-2025 | 12:00am

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి, అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌ఎం హుస్సాని (ముజీబ్) ఆధ్వర్యంలో గురువారం నాంపల్లిలోని గృహకల్ప కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫహీముద్దీన్ ఖురేషి, మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇఫ్తార్‌లో సుమారు 2 వేల మంది పాల్గొన్నారు. వీరికి ఫలహారాలతో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర సంఘ నాయకులు, మహిళ ఉద్యోగులు, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు, ముజీబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.