24 May, 2026 | 8:00 AM

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్

23-03-2025 12:00 AM

సికింద్రాబాద్ ఎంఎల్‌ఏ పద్మారావు గౌడ్

వారాసిగూడా, 22 మార్చి (విజయక్రాంతి) : ఇఫ్తార్ విందులు మత సామర స్యానికి ప్రతీకగా నిలుస్తాయని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వారాసిగుడా లోని జామ్ జామ్ ఫంక్షన్ హాల్ లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తా ర్ విందులో పద్మారావు గౌడ్ పాల్గొని ప్ర సంగిస్తూ ముస్లింలు ఉపవాస దీక్షలను పవిత్రంగా భావిస్తారని అన్నారు. కార్పొరేటర్లు, నేతలు, మైనారిటీ ప్రముఖులు పాల్గొన్నారు.