ఐకెపి ఆఫీస్ వద్ద ఐకెపి వివోఏ నేటికీ నాలుగో రోజు
బోధన్ ,మే 28 (విజయక్రాంతి): బోధన్ పట్టణ కేంద్రంలోని ఐకెపి ఆఫీస్ వద్ద. ఐకెపి వివోఏ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటికీ నాలుగో రోజుకు చేరుకుంది.. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజాంబాద్ జిల్లా కమిటీ మద్దతు ఇవ్వడానికి వారికి మద్దతుగా మాట్లాడుతూ... జిల్లా అధ్యక్షులు గైని రాములు. జిల్లా కార్యదర్శి ఏశాల గంగాధర్.. ఇరువురు మాట్లాడినారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఐ.కె.పి వివోఏ వెంటనే పిలిచ వారితో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారం చేసి సమ్మె నిరంత చేయాలని డిమాండ్ చేసినారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాల మద్దతు ప్రజల మద్దతు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రధాన డిమాండ్లు. పని భారాన్ని తగ్గించాలి. కనీస వేతనం నెలకి 26వేలు ఇవ్వాలి. అర్హులైన వారికి సీసీలుగా నియమించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రమాద ఆరోగ్యం సాధారణ 20 లక్షల కల్పించాలి 58 జీవోను సవరించాలి. అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు. వెంకటేష్. రమేష్. పోశెట్టి. నరేష్. లక్ష్మి. కృష్ణవేణి. గోదావరి. గంగ భవాని. రాజమణి. తదితరులు పాల్గొన్నారు.






