13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అనుమతులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు

31-03-2026 06:26 PM

పది అడుగుల రోడ్డు... ఐదు అంతస్థుల భారీ అక్రమ నిర్మాణం

టౌన్ ప్లానింగ్ అండతోనే అంటూ స్థానికుల ఆరోపణలు

చర్యలు తీసుకుంటాం: ఏసీపీ ప్రసీద

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా ధర్జాగా బహుళ అంతస్థులు నిర్మిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బండారి లే అవుట్ లో ఓ నిర్మాణదారుడు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవన నిర్మాణానికి తెరలేపాడు. దాదాపు 50 గజాల స్థలంలో పది అడుగుల రోడ్డులో భారీ భవనం నిర్మిస్తున్నాడు. ఈ అక్రమ నిర్మాణం వల్ల స్థానికులకు ప్రమాదం పొంచి ఉంది.అయినా సరే పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాడు.

టౌన్ ప్లానింగ్ అండతోనే

అయితే భారీ అక్రమ నిర్మాణానికి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అండ సంపూర్ణంగా ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.కాసులకు కక్కుర్తి పడుతూ అందినకాడికి దండుకుంటూ అక్రమ నిర్మాణదారులకు టౌన్ ప్లానింగ్ అధికారులు కొమ్ముకాస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసిన సరే సదరు నిర్మాణాలకు నోటీసులు జారిచేసి చేతులు దులుపుకుంటున్నారు. తర్వాత మళ్ళీ యధావిధిగా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని, నిర్మాణదారులపై క్రిమినల్  కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం..: నిజాంపేట్ సర్కిల్ ఏసీపీ ప్రసీద

అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న భారీ అక్రమ నిర్మాణంపై ఏసీపీ ప్రసీద ని వివరణ కోరగా పరిశీలించి నోటీసులు ఇస్తామని తెలిపారు. నోటీసుల సమయం పూర్తయ్యాక కూల్చివేతలు జరుగుతాయని అన్నారు.