10 June, 2026 | 2:52 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు

09-01-2026 12:00 AM

సహజ వనరులు కనుమరుగు.. పట్టించుకోని అధికారులు 

తూప్రాన్, జనవరి 8: సహజ వనరులు కనుమరుగవుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో మట్టిని అక్రమంగా తవ్వడంతో గుట్టలు మాయమవుతున్నాయి. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 213 సర్వే నెంబర్ లో (టాటా కాఫీ వెనక భాగం, డంపు యార్డు సమీపంలో) వ్యాపారులు మట్టిని తవ్వి విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఇదంతా అధికారుల కనుసన్నల్లో  జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు మట్టి వ్యాపారుల మామూళ్లకు తలొగ్గి అటువైపు చూడటం లేదని స్థానిక రైతులు మండిపడుతున్నారు. వార్తా కథనాలు ప్రచురితమైతే అధికారులకు అవకాశం మరింత కలిసొస్తుందని, వాహనాలను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు చర్యలు చేపట్టకుండానే వాహనాలను వదిలేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. 

రాళ్లతో వ్యాపారం...

గుట్ట చుట్టూ ఉన్న మట్టిని తవ్వడంతో పెద్దపెద్ద రాళ్లను కనీలు, గనేటుగా తయారు చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో మట్టి తరలించాలన్న బండరాళ్లను తొలగించాలన్న రెవెన్యూ, మైనింగ్ శాఖల అనుమతులు అవసరం. కానీ ఆ రెండు శాఖల అధికారులకు, వ్యాపారులకు మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందంతో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి వ్యాపారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.