1 July, 2026 | 11:24 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అక్రమ జొన్నల నిల్వలు పట్టివేత

02-05-2025 10:28 PM

వ్యాపారిపై కేసు నమోదు... 

ఇచ్చోడ,(విజయక్రాంతి): మండలంలోని మాదాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన జొన్నలను పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చోడ ఎస్సై తిరుపతి కి అందిన సమాచారం మేరకు శుక్రవారం దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్ గ్రామానికి చెందిన షేక్ సజ్జద్ అనే వ్యాపారికి సంబంధించిన రేకుల షెడ్డులో సుమారు 500 జొన్నల బ్యాగులు లభ్యమైనట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని రెవెన్యూ, వ్యవసాయ అధికారుల సమక్షంలో పంచనామ నిర్వహించి, వారికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. సదరు వ్యాపారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.