1 July, 2026 | 10:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఇత్తడి వస్తువుల తయారీదారుల ఆర్థిక అభివృద్ధికి చేయూత

02-05-2025 10:26 PM

ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా...

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూత నివ్వడం జరుగుతోందని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ,  హైదరాబాద్ కు చెందిన ఫీక్కీఫ్లో లేడీస్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా జిల్లాలో ఇత్తడితో వస్తువులు, బొమ్మలను తయారు చేస్తున్న వారికి చేయూతనిచ్చేందుకు స్థానిక కొమరం భీమ్ కాంప్లెక్స్ లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు తయారు చేసిన ఇత్తడి వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా తయారీదారులకు పలు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఫీక్కీఫ్లో లేడీస్ ఆర్గనైజేషన్ వారు సుమారు 200 వరకు ఇత్తడి వస్తువుల కొనుగోలు కోసం ఆర్డర్ తీసుకున్నారు. సమావేశంలో ఫీక్కీఫ్లో లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ ప్రతిభ, సభ్యులు కవిత రెడ్డి, దీప్తి, శీతల్, ఐటీడీఏ జేడీఎం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.