13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కంటైనర్లలో అక్రమంగా ఆవుల రవాణా

20-01-2026 01:09 AM

అడ్డుకున్న హిందూ వాహిని కార్యకర్తలు

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘటన

నిర్మల్, జనవరి 19(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఆవులను తరలిస్తున్న రెండు కంటైనర్లను సోమవారం రాత్రి హిందూ వాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు.కార్యకర్తలు ఆందోళన చేయడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. నిర్మల్ కేంద్రంగా కొన్ని రోజులుగా ఆవులకు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో హిందూవాహిని కార్యకర్తలు నిఘాపెట్టారు. పట్టణంలోని శివారు ప్రాంతంలో రెండు కంటైనర్లు ఆవులు ఎక్కించి తరలిస్తుండగా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ముందుకు రాగానే హిందూ వాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు.

రెండు కంటైనర్లలో సుమారు 50 వరకు ఆవులు ఉన్నాయని,తమను చూసి డ్రైవర్లు పారిపోయినట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న ఏఎస్పీ సాయికిరణ్‌తో పాటు పట్టణ సీఐలు ఐదుగురు ఎస్‌ఐలు పోలీసు బలగాలతో వచ్చి ఆందోళన చేస్తున్న కార్యకర్తలకు నచ్చజెప్పి కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ విషయం పట్టణంలో ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో వందలాది మంది యువకులు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు. విచారణ జరిపి తప్పకుండా బాధ్యులపై చర్య తీసుకుంటామని ఏఎస్పీ హామీ ఇవ్వడంతో హిందూవాహిని కార్యకర్తలుఆందోళన విరమించారు. పట్టుకున్న లారీలను పోలీసుల సూచన మేరకు రహస్య ప్రదేశాలకు తరలించారు.