calender_icon.png 6 August, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ కు ట్రంప్ బిగ్ షాక్..

06-08-2025 08:25:45 PM

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మరోసారి భారతదేశంపై బాంబు పేల్చారు. ఇటీవలే ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాలపై అధికారిక ముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే, డొనాల్డ్ ట్రంప్ బుధవారం భారతదేశంపై మరో 25 శాతం అదనపు సుంకాన్ని విధిస్తామని ప్రకటించారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ ఈరోజు సంతకం చేశారు. దీనితో భారతదేశంపై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరుకుంటాయి. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తునందున ట్రంప్ భారతదేశంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆగస్టు 7 నుండి ప్రారంభ సుంకం అమలులోకి వచ్చినప్పటికీ, అదనపు సుంకం 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తుంది.