29-05-2025 01:09:00 AM
యాదాద్రి భువనగిరి మే 28 ( విజయ క్రాంతి): సాంస్కృతిక వారసత్వ, ఇక్కత్ చీరల నేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ ఈసారి ఆఫ్రికన్ డెలిగేట్ ( మన్ననలు పొందింది.
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో5 రోజుల పర్యటన లో భాగంగా బుధవారం ఆఫ్రికా ఖండంలో 15 మధ్య, పచ్చిమ ఆఫ్రికన్ దేశాలకు చెందిన 30 మంది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ లు పోచంపల్లి విలేజ్ పార్క్ ను సందర్శించి, స్థానిక సంస్కృతి, కళలతో, మ్యూజిక్ తో మమేకమయ్యారు.
ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని స్థానిక పార్కులో.పరిశీలించిన అతిథులు, నూలు వడకడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రియలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ‘ఒక్క చీరకు వారాలు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత కంటెస్టెంట్ లను మనస్సును హత్తుకుంది.
చీరలపై భిన్న డిజైన్లను గమనించిన అతిథులు, కొందరు స్వయంగా రాట్నంతో నూలు వడికే ప్రయత్నం చేశారు. అనంతరం గ్రామంలో చీరల తయారీని పరిశీలించారు. కొంతమంది చీరల షాపింగ్ చేశారు. ఆఫ్రికన్ ప్రతినిధుల సందర్శన కార్యక్రమంలో దక్షిణాఫ్రికా కంటెంట్ క్రియేటర్ యోవాని నాయుడు, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దశరథ పాల్గొన్నారు