23-06-2025 01:04:00 AM
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ తారాగణం భాగమయ్యారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కానున్న సందర్భంగా మేకర్స్ హైదరాబాద్లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. “కన్నప్ప విష్ణు సినిమా కాదు. ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ సినిమాను చూసినప్పుడు వావ్ అనిపించింది. నా కెరీర్లో ఉన్న దర్శకులందరిలో ముఖేశ్ ది బెస్ట్. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు అయితే.. నేను ఆయనకు కర్ణుడిని” అన్నారు. దర్శకుడు ముఖేశ్ సింగ్ మాట్లాడుతూ.. “జన్మభూమిని, కర్మభూమిని మర్చిపోకూడదు.
నాకు హైదరాబాద్ కర్మభూమిలాంటిది. మోహన్బాబు నన్ను నమ్మి ఇక్కడికి తీసుకొచ్చారు. విష్ణు రేర్ యాక్టర్. ఆయన నటన స్థాయిని అందరూ చూడబోతున్నారు” అని చెప్పారు. నటుడు, నిర్మాత మోహన్బాబు మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ప్రతి పాత్రా హీరోలానే తీశాం. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను” అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, శరత్కుమార్, మధుబాల, శివబాలాజీ, అర్పిత్ రంకా, ముఖేశ్ రిషి, మైత్రి శశి, బీవీఎస్ రవి, తోట ప్రసాద్, ఆకెళ్ల శివప్రసాద్, పాటల రచయితలు సుద్దాల అశోక్తేజ, రామజోగయ్యశాస్త్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మెడియం బాబూరావు, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.