ఈ వారం వార్తల్లో..
తైవాన్ బరాబర్ మాదే!
తైవాన్ విషయంలో చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ కఠినమైన వైఖరి అవలంబిస్తున్నారు. ఆ దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. తైవాన్ వందకు వందశాతం చైనాలోని భూభాగమేనని వాదిస్తున్నారు. అవసరమైతే సైనిక బలాన్ని ఉపయో గించి మరీ, ఆ ప్రాంతాన్ని చైనాలో విలీనం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో అమెరికా జోక్యంపైనా మండిపడుతున్నారు.
సతీశన్ ఎదుట సవాళ్లు
ఎడతెగని ఉత్కంఠ నడుమ ఏఐసీసీ ఇటీవల కేరళం సీఎం పదవిని వీడీ సతీశన్కు కట్టబెట్టింది. కాంగ్రెస్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న సతీశన్కు పార్టీ మద్దతైతే ఉంది గానీ, ఇకపై ప్రజల మద్దతు ఎలా ఉంటుందనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే.. రాష్ట్ర ఖజానా పూర్తిగా నిల్లు. పైగా తలపై నెలనెలా అప్పుల చెల్లింపులు, వడ్డీల భారం. వాటిని చక్కదిద్దుకుంటూనే సంక్షేమ పథకాలనూ అమలు చేయాల్సిన పరిస్థితి.






