17 April, 2026 | 3:26 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మందుల ధరల పెంపు?

27-03-2025 12:14 AM

క్యాన్సర్, మధుమేహ మందులు మరింత ప్రియం?

వెల్లడించిన విశ్వసనీయ వర్గాలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మందుల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధరల పెరుగదల త్వరలోనే ఉంటుందని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు 1.7 శాతం మేర పెరగనున్నట్లు వారు పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్ (ఏఐవోసీడీ) జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ ‘బిజినెస్ టుడే’ తో మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా మార్కెట్లో 90 రోజులకు సరిపడా మందులు అందుబాటులో ఉంటాయి. కొత్త ధరలు అమలయ్యేందుకు రెండు మూడు నెలల సమయం పడుతుంది.’ అని పేర్కొన్నారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన తనిఖీల్లో దేశంలోని ఫార్మా కంపెనీలు పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశంలో మందుల ధరలను నిర్ణయించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఫార్మా కంపెనీలు 307 సందర్భాల్లో ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించింది. మందుల తయారీకి అవసరం అయ్యే ముడిసరుకుల ధరలు పెరుగుతున్నందున ఈ పెంపు ఉపశమనం ఇస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ మందుల ధరలను తగ్గించిన కారణంగా 2022లో రోగులకు అత్యవసర మందులకు సంబంధించి దాదాపు రూ. 3,788 కోట్లు ఆదా అయినట్లు నివేదికలు చెబుతున్నాయి.