calender_icon.png 14 June, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన బస్సు పాస్ చార్జీలను ఉపసంహరించుకోవాలి

13-06-2025 01:50:44 AM

భద్రాద్రిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన..

భద్రాచలం, జూన్ 12 (విజయ క్రాంతి) రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు పాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం బస్టాండ్ ఆవరణలో గురువారం నిరసన కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి లు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు పాసులపై 20% నుండి 50% వరకు పెంచడం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు.

విద్యార్థుల బస్ పాస్ పై కూడా చార్జీలు పెంచడంతో సామాన్య విద్యార్థులపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. స్కూల్ ఓపెనింగ్ కావడంతో పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు పాసుల ద్వారా వచ్చి చదువుకునే విద్యార్థులకు భారం అవుతున్నాయని అన్నారు. తక్షణమే పెంచిన బస్సు చార్జీలను ఉపసంహరించుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెట్టి వచ్చిన నష్టాన్ని ఈ విధంగా చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారాల మోపడం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నకరికంటి నాగరాజు,సండ్ర భూపేంద్ర, కుంజా శ్రీనివాస్, ఎస్ అజయ్ కుమార్,కోరాడ శ్రీనివాస్, ధనకొండ రాఘవయ్య, సీనియర్ నాయకు లు ఎం వి ఎస్ నారాయణ, శాఖ కార్యదర్శిలు డి రామకృష్ణ,జి నాగలక్ష్మి, రవీందర్ పాల్గొన్నారు.