calender_icon.png 15 June, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం

13-06-2025 01:51:30 AM

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు

మెదక్, జూన్ 12(విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధిలో అగ్రగామిగానిలిపేందుకు విశేష కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. గురువారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 420 మంజూరి పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు పదేళ్ల కాలంలో కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే పద్ధతి మా ప్రభుత్వానిది కాదని, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలాగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

విద్యా, వైద్యం ప్రధాన అజెండాగా చేసుకునే పిల్లలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలని రామాయంపేట మెయిన్ రోడ్ లో 25 ఎకరాలలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించుకునే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, ఇతర ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు పాల్గొన్నారు.