2 April, 2026 | 2:55 PM

Breaking News

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •  

హైదరాబాద్‌లో పెరిగిన ఓటింగ్ శాతం

15-05-2024 02:12 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగడంపై జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని సెటిల ర్లు వారి సొంత ప్రదేశాలకు వెళ్లినప్పటికీ, గతంలో కంటే ఓటింగ్ పెరగడంపై హర్షం వ్యక్తంచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల కంటే ఈసారి హైదరాబాద్ జిల్లాలో అదనంగా 3.73 శాతం ఓటింగ్ పెరిగినట్టు వెల్లడించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లో 2019లో 46.26 శాతం నమోదు కాగా, 2024లో 49.04 శాతం నమోదైంది. జిల్లాలో ఓటింగ్ పెరగడానికి చేపట్టిన స్వీప్ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, మీడియా సంస్థలకు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ధన్యవాదాలు తెలిపారు.