బోధన్ ఆర్డీవో కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
15-08-2026 10:16 AM
బోధన్ ఆగస్టు 15(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఏం.విజయ కుమారి, బోధన్ వందేమాతరం గేయాన్ని అలపించి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.






