07-06-2025 02:04:48 AM
బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆరుట్ల
చేర్యాల, జూన్ 6 : నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని, రాబోవు కాలంలో ప్రపంచంలోనే అగ్రగామిగా తయారవుతుందని జన గామ జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు ఆరుట్ల దేశమంత రెడ్డి అన్నారు. మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన సంకల్పం సాకారం కార్య క్రమాన్ని కొమురవెల్లి మండలం అయినా పూర్ లోని విశ్వబ్రాహ్మణ కళ్యాణమండపంలో శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్య క్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారత్ ను విశ్వ గురువుగా నిల్పాలన్నదే మోడీ ఆశయమన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడకుండా ఆపరేషన్ సింధూరం పేరుతో పాకిస్తాన్ ఉగ్ర వాద శిబిరాలను ధ్వంసం చేసి దేశ ప్రజల మన్నన లను పొందాడన్నారు. మోడీ పాలనలో అన్ని రకాల పంటలకు మద్దతు ధర పెంచి, రైతులకు బాసటగా నిలిచారన్నారు.
గరీబ్ కళ్యాణ యోజన కింద పేదలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బూతు స్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనగామ అసెంబ్లీ కన్వీనర్ దండ్యాల లక్ష్మారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బూర్గుజు స్వరూప, నాయకులు ఎక్కల దేవి శ్రీనివాస్, స్వాములపల్లి బిక్షపతి, వగలబోయిన నారాయణ, వంగ శివారెడ్డి, దండ్యాల బిక్షపతి రెడ్డి, బూర్గోజు నాగరాజు పాల్గొన్నారు.