calender_icon.png 10 June, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా వైఖరిని ఎండగట్టిన భారత్

15-05-2025 12:11:55 AM

అరుణాచల్ ప్రదేశ్ విషయంలో జోక్యంపై మండిపాటు

న్యూఢిల్లీ, మే 14: చైనా అవలంభిస్తున్న వైఖరిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పేర్లు మార్చేందుకు చైనా యత్నిస్తోంది. ఈ యత్నాలపై స్పందించిన విదేశాంగ శాఖ చైనాపై మండిపడింది. ‘అరుణాచల్‌లో పలు ప్రదేశాలకు పేర్లు పెట్టేందుకు చైనా అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.

ఈ విధానం భారత వైఖరికి విరుద్ధం. పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ నుంచి విడదీయలేరు. అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమని అందరికీ తెలుసు.’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు పేర్లు మార్చుతూ చైనా అనేక జాబితాలను విడుదల చేసింది.