15-05-2025 12:14:29 AM
న్యూఢిల్లీ, మే 14: దేశంలో మరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. భారత్లో ఇప్పటికే ఐదు సెమీకండక్టర్ యూనిట్లు ఉండగా.. ఇది ఆరోది. యూపీలోని జెవార్ విమానాశ్రయం దగ్గర్లో రూ. 3,706 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను భేటీ అనంతరం సమాచార, మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
‘సెమీ కండక్టర్ల రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ యూనిట్ ఏర్పాటుతో దాదాపు 2వేల మందికి ఉపాధి లభించనుంది. హెచ్సీఎల్, ఫాక్స్కాన్ కంపెనీలతో కలిసి ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్లాంట్ ద్వారా నెలకు 20వేల చిప్స్ ఉత్పత్తి చేయనున్నాం.
కండక్టర్లకు వాడే పరికరాలు భారత్లో తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమ ముందుకు వెళ్తోంది.’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసే యూనిట్లో మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి పరికరాల డిస్ప్లే డ్రైవర్ చిప్స్ తయారవనున్నాయి.