15-05-2025 12:08:25 AM
న్యూఢిల్లీ, మే 14: ఫిరోజ్పుర్ వద్ద గతనెల పాక్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ సాహూను అదుపులోకి తీసుకోగా, ఎట్టకేలకు విడుదల చేశారు. అతన్ని బుధవారం ఉదయం పంజాబ్లోని అటారీ సరిహద్దు వద్ద మన దళాలకు అప్పగించారని పీటీఐ పేర్కొంది. బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్ జవాన్ అయిన పూర్ణమ్.. పంజాబ్లోని ఫిరోజ్పుర్ సెక్టార్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఏప్రిల్ 23న సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా అస్వస్థతకు లోనయ్యారు. సమీపంలో ఓ చెట్టు కనిపించడంతో దానికింద విశ్రాంతి తీసుకున్నారు. అయితే, అది పాక్ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. సరిహద్దు దాటి రావడంతో పాక్ రేంజర్లు పూర్ణమ్ను అదపులోకి తీసుకున్నారు. జవాన్ విడుదల కోసం రెండు దేశాల భద్రతాదళాలు చర్చలు జరిపాయి.
మరోవై పు పూర్ణమ్ కుటుంబసభ్యులు తీవ్రం గా ఆందోళన చెందారు. గర్భిణి అయి న ఆయన భార్య.. భార్త విడుదల కో సం కేంద్రాన్ని వేడుకున్నారు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్ సమీపంలో ఉన్న భారత్-పాక్ సరిహద్దులోకి ఈ నెల మొదటివారంలో ఓ పాక్ రేంజర్ చొరబడ్డాడు. దీంతో వారిపై ఒత్తిడి పెరగడంతో పూర్ణమ్ను అప్పగించించారు. ప్రతిగా భారత్ పాక్ రేంజర్ను ఆదేశానికి అప్పగించింది.