08-08-2025 01:15:48 PM
మద్నూర్, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహకారంతో అర్హులైన వారికి కృషిచేస్తున్నారన్నారు. ఇండ్లు(Indiramma House) నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి.. వారి కళా సహకారం చేస్తుందనని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని భూమి పూజ చేశారు. వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ సోమావార్ మహేష్ ముగ్డే వార్ బస్వంత్ రావ్ పటేల్ పంచాయతీ సిబ్బంది తులసి రామ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.