19-01-2026 12:39:59 AM
ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా తన వంతుగా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. నేరడిగొండ మండలం గౌలిగూడ గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆదివారం ఎమ్మెల్యే గ్రామా న్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గౌలిగూడలో గుడిసెలు లేకుండా అందరికి పక్క ఇండ్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుంటానన్నారు. గ్రామానికి మొట్టమొదటి సారిగా రూ. 1 కోటి 50 లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేయించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.