23-06-2025 12:40:24 AM
- కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
- విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
- జూలై నాటికి అందుబాటులోకి ఎరువులు, విత్తనాలు
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఇందిరమ్మ నమూనా ఇల్లు ప్రారంభం
కరీంనగర్, జూన్ 23 (విజయక్రాంతి): రాబోయే మూడున్నర సంవత్సరాల వ్యవధిలో సాచురేషన్ పద్ధతిలో నిరుపేద లం దరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామ ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలసి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీ ద్వారా స్క్రూటినీ చేయిం చి, అర్హులైన నిరుపేదలకు పార్టీలకతీతంగా మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశా రు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరికంటే రెండింతల ఆదాయం వచ్చే పంటలను రైతులకు సూచించాలని, రైతులను ఒప్పిస్తూ కూరగాయల పంట విస్తరణ చేయాలన్నారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్లో జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ సం దర్శించి అక్కడి పరిస్థితులపై నివేదిక అందించాలని ఆదేశించారు. మంత్రి పొన్నం మా ట్లాడుతూ.. 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రైతులు ఆయిల్ పా మ్ వంటి పంట లు వేయాలని సూచించారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూ.5 లక్షల వ్యయంతో కలెక్టరేట్ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ప్రా రంభించారు.
ఆయిల్ పామ్ విస్తరణకు చర్యలు: మంత్రి తుమ్మల
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పాలకుల హయాంలోని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ జిల్లాలో అందుబాటులో పె ట్టుకోవాలని సూచించారు.
యూరియా వా డకం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాలకు తక్కువ సరఫరా చేస్తుందని, అవసరమైన మేర మాత్రమే యూరియా వాడాలని, అధికంగా వాడటం వల్ల భూ సా రం తగ్గిపోతుందని, భూమికి నష్టం జరుగుతుందని, దీనిపై రైతులకు అవగాహన కల్పిం చాలని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయిల్ పామ్సాగుపై రైతులు శ్రద్ధ చూపాలని కోరారు. ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలకు మించి ఆయిల్ పామ్ విస్తర ణ చేపట్టాలని అన్నారు. నగరం పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు పెద్ద ఎత్తున చేయాలని మంత్రి తెలిపారు. విద్యా శాఖ పట్ల కలెక్టర్లు శ్రద్ధ వహించాలని, ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందాలని, ప్రభు త్వ బడులలో విద్యార్థుల నమోదు పెంచాలని మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసా ద్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయరమణారావు, మక్కన్సింగ్ రాజ్ఠాకూర్, డాక్టర్ సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్ పాల్గొన్నారు.