31-05-2025 12:00:00 AM
కమల్హాసన్ హీరోగా, మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా ‘థగ్లైఫ్’. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. హీరో నితిన్ తండ్రి ఎన్ సుధాకర్రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ వైజాగ్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమల్హాసన్ మాట్లాడుతూ.. “మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి సెల్యూట్ చేస్తా. అలాగే నేర్చుకున్నా. నేను 15 తెలుగు సినిమాలు చేస్తే.. 13 విజయవంతమైనవిగా నిలిచాయి. ఆ విజయాల్ని మీరే ఇచ్చారు. ప్లాప్స్ మాత్రమే నేనిచ్చాను. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి ‘థగ్లైఫ్’ అందిస్తున్నా” అన్నారు. త్రిష మాట్లాడుతూ.. “వర్షం’ సినిమా రిలీజ్ 22 ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్నారు.
థగ్లైఫ్ సినిమాలో కమల్హాసన్తో ఫస్ట్ టైమ్ కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంద్రాణి అనే క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని తెలిపారు. నిర్మాత సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. ‘వైజాగ్ అంటే కమలహాసన్కు వెరీ స్పెషల్.
ఆయన సినిమాల్ని ఇక్కడ ఎంతగానో ఆదరిస్తారు. అందుకే ఈ వేడుకను ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాం. జూన్ 5న ఈ సినిమాను విజయవంతం చేస్తే కమల్హాసన్ను ఇక్కడికి తీసుకొచ్చి సక్సెస్ మీట్ పెడతాం. ఈ సినిమా 100 శాతం సూపర్ డూపర్ హిట్’ అని తెలిపారు. హీరో శింబు, నటీనటులు నాజర్, అభి రామి, చిత్రబృందం పాల్గొన్నారు.