31-05-2025 02:46:35 AM
నాగర్కర్నూల్, మే 30 (విజయక్రాంతి): శ్రీశైలం జలాశయానికి మే నెలలోనే భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న ముందస్తు భారీ వర్షాల నేపథ్యంలో జూరాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. అధికారులు అప్రమత్తమై జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. గురువారం 38.9150 టీఎంసీల నీరు నిల్వ ఉండగా సుంకేశుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు నుంచి 37,082 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రానికి 821.90 అడుగుల వద్దకు చేరి 42.27 టీఎంసీలకు నీరు నిల్వ చేరింది.