31-05-2025 02:49:26 AM
సీఎంను నిలదీసిన హరీశ్రావు
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదని ప్రతి వేదిక మీద తన చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. రూ.6,200 కోట్లతో హిమాచల్ప్రదేశ్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్కోను ఎలాం రంగంలోకి దింపుతారని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
ఆయన మాట్లాడుతూ.. హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ మూడేండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసినా 510 మెగావాట్ల ప్లాంట్ ని కట్టేందుకు టీజీ జెన్కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకొని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద రూ.26 కోట్లు చెల్లించి మరో రూ.26 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడిందన్నారు. దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయిందన్నారు.