మౌలిక సదుపాయాలు కల్పించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, మార్చి 26 (విజయక్రాంతి): సూర్యాపేట పట్టణంలోని కేసారం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబందిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యా లయంలో రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
పట్టణ ప్రజల కోసం నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లలో మౌళిక సదుపాయలు అయిన తాగునీరు, విద్యుత్ మొదలైన సదుపాయాలను నెల రోజుల్లో పూర్తిచేయాలని సంబందిత కాంట్రాక్టర్ ఆదేశించారు. వాటర్ ట్యాంక్లకు కనెక్షన్ల పనులు పూర్తి చేసి నీటిసరఫరా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధార్థ, మున్సిపల్ కమిషనర్ హనుమంత్రెడ్డి, గుత్తేదారులు, అధికారులు పాల్గొన్నారు.




