15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మా ఇంట్లో ఓట్లు.. అమ్మబడవు

10-12-2025 02:32 PM

పస్థల గ్రామంలో విద్యార్థుల వినూత ప్రదర్శన.. సెల్యూట్ చేస్తున్న గ్రామస్తులు 

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామంలో చిన్నారులు చేసిన పనికి యూత్ ఫిదా అవుతున్నారు. జిల్లా ప్రజా పరిషత్ పసునూరు స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న రెంటాల జోయల్ "ఓట్లు అమ్మడం, కొనడం నేరం" అని ఇంటిముందు రాసి పెట్టాడు. స్కూల్ లో సోషల్ టీచర్ వెంకన్న ఇలా రాయమని చెప్పారని, చిన్నారులు అన్నారు. ఇది పది రోజుల క్రితమే ఏర్పాటు చేసినా, అది ఇప్పుడు ఎక్కువగా గ్రామంలో వైరల్ అయింది. ఏది ఏమైనా మారుతున్న సమాజంలో విద్యార్థులు ఏకంగా మార్పును కోరుకోవడం సమంజసమైన విషయమని అంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటర్లు తమ హక్కులను వినియోగించుకోవాలని చిన్నారుల ప్రార్థన.