12 June, 2026 | 12:04 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

మా ఇంట్లో ఓట్లు.. అమ్మబడవు

10-12-2025 02:32 PM

పస్థల గ్రామంలో విద్యార్థుల వినూత ప్రదర్శన.. సెల్యూట్ చేస్తున్న గ్రామస్తులు 

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామంలో చిన్నారులు చేసిన పనికి యూత్ ఫిదా అవుతున్నారు. జిల్లా ప్రజా పరిషత్ పసునూరు స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న రెంటాల జోయల్ "ఓట్లు అమ్మడం, కొనడం నేరం" అని ఇంటిముందు రాసి పెట్టాడు. స్కూల్ లో సోషల్ టీచర్ వెంకన్న ఇలా రాయమని చెప్పారని, చిన్నారులు అన్నారు. ఇది పది రోజుల క్రితమే ఏర్పాటు చేసినా, అది ఇప్పుడు ఎక్కువగా గ్రామంలో వైరల్ అయింది. ఏది ఏమైనా మారుతున్న సమాజంలో విద్యార్థులు ఏకంగా మార్పును కోరుకోవడం సమంజసమైన విషయమని అంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటర్లు తమ హక్కులను వినియోగించుకోవాలని చిన్నారుల ప్రార్థన.