19-12-2025 01:58:46 AM
ముషీరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాం తి): గాంధీనగర్ డివిజన్ పరిధిలోని పాత మయూరి థియేటర్ లేన్లో భాగ్యనగర్ కాం ప్లెక్స్ అపార్ట్మెంట్ నుండి మెయిన్ రోడ్డు వరకు సుమారు రూ. 22లక్షల జిహెచ్ఎంసి నిధులతో మొదలైన నూతన సీసీ రోడ్డు నిర్మాణం పనులను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఇంజినీరింగ్ అధికారులు బీజేపీ నాయకులు స్థానిక అపార్ట్మెంట్ వాసులతో కలిసి గురువారం పర్యవేక్షించారు. అనంతరం స్థానికంగా వున్న సమస్యలను అపార్ట్మెంట్ వాసులను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, దామోదర్ శ్రీకాంత్, రాజు, పి. నర్సిం గ్రావు, సురేష్ రాజు, ఆనంద్ రావు, సాయి కుమార్, స్థానిక అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వాసులు ఇ. శ్రవణ్ కుమార్, శేషు, అశోక్ బాజ్ప, జ్యోతి రెడ్డి, అంజన పాల్గొన్నారు.