3 July, 2026 | 9:30 PM

Breaking News

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలన

03-04-2025 12:29 AM

అదనపు కలెక్టర్ నర్సింగ రావు

గద్వాల, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): గద్వాల మండలంలోని నల్లదేవుని గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, పురోగతిని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణపు పనులన్నింటినీ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణ నాణ్యతపై రాజీపడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చేపడుతున్న పనులపై సంబంధిత అధికారులకు తగు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించి వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు.

బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయిన పనులకు అవసరమైన లక్ష రూపాయలను వెంటనే అందజేసేందుకు నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమా దేవి, సంబంధిత శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.