calender_icon.png 9 May, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..

08-05-2025 08:10:10 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య..

హనుమకొండ (విజయక్రాంతి): రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి, నిర్ణీత రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య(District Collector Pravinya) నిర్వాహకులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. నడికుడ మండలంలోని చర్లపల్లిలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, రైస్ మిల్లులకు పంపించిన ధాన్యం నిల్వల గురించి, రైతుల ఖాతాలలోకి జమ చేసిన బిల్లుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ధాన్యం తడిసిపోకుండా రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా లారీల కొరత, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. గన్నీ బ్యాగులు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే మీటర్లు, గ్రెయిన్ క్యాలిపర్లు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏ దశలోనూ రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ నారాయణ,  తహసీల్దార్ నాగరాజు, ఎపిఎం రమాదేవి, ఎఇఓ నాగరాజు, రైతులు తదితరులు ఉన్నారు.