calender_icon.png 26 June, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్పత్రుల్లో వంటశాలల తనిఖీ

25-06-2025 01:38:31 AM

కమిషనర్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచనల మేరకు నగరంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ సర్కిల్ ప్రాంతంలోని ఆసుపత్రులలో ఉన్న వంటశాలలను మంగళ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆహార భద్రతా అధికారులు సుమారు 73 హాస్పిటల్ కిచెన్లను తనిఖీ చేశారు.

తనిఖీల సమయంలో 14 చోట్ల నమూనాలను సేకరించి, విశ్లేషణ కోసం హైదరాబాద్ నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపారు. ఆహార పదార్థాల తయారీ, ఆహార పదార్థాల సరఫరా, వంటగది ప్రాంగణాన్ని సరిగ్గా నిర్వహించడంలో పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని హాస్పిటల్ కిచెన్ల యాజమాన్యాలకు సూచించారు.