25-06-2025 01:38:16 AM
శ్రీరాంపూర్ జీఎంకు వినతి పత్రం అందజేసిన సీఐటీయూ నాయకులు
శ్రీరాంపూర్ (మంచిర్యాల), జూన్ 24 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను నిలుపుదల చేయాలని, సింగరేణి పరిరక్షణకు కొత్త గను లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరాంపూర్ ఏరి యా జనరల్ మేనేజర్ శ్రీనివాస్కి సమ్మె నోటీసు అందజేశారు.
అనంతరం ఎస్సిఈ యు బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ మాట్లాడుతూ సింగరేణిలో జూలై 9న జరుపతలపెట్టిన సమ్మెను సంపూర్ణంగా జయ ప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చా రు. కేంద్ర ప్రభుత్వ చర్యలు సింగరేణికి శాపంగా మారాయని, సింగరేణిని కాపాడుకోవడానికి సమ్మె ఒక్కటే మార్గమని, ప్రభు త్వరంగ సంస్థలను కాపాడుకోవాలని, కార్మికులను కట్టు బానిసలుగా మార్చనున్న ఈ లేబర్ కోర్డులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ వైస్ ప్రెసిడెంట్ కస్తూరి చంద్రశేఖర్, చీఫ్ ఆర్గనైజర్ వెంగళ శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు పెరుక సదానందం, తోడే సుధాకర్, సిరికొండ శ్రీనివాస్, బోడకుంట శంకర్, బొజ్జ నవీన్, గుపెళ్లి కృష్ణ, వెంకట్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.